#Nani32 : డీవీవీ ఎంటర్టైన్మెంట్ తో న్యాచురల్ స్టార్ నానీకి మంచి అనుబంధం ఉంది. నేచురల్ స్టార్ నాని పుట్టిన రోజు (ఫిబ్రవరి 24)న జరిగింది. ఈ సందర్భంగా తన తదుపరి సినిమా #Nani32ని అఫీషియల్ గా ప్రకటించారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమా తర్వాత ఈ నిర్మాణ సంస్థకు ఇది వరుసగా రెండో ప్రాజెక్ట్.
స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ సుజీత్ ఓ క్రేజీ కథతో నానిని ఆకట్టుకున్నాడని అంటున్నారు. ఈ కాన్సెప్ట్ ను వీడియో ద్వారా వెల్లడించారు. అహింసాయుత మార్గాన్ని ఎంచుకునే ఒక హింసాత్మక వ్యక్తి కథ ఇది. కానీ గతం అతన్ని వెంటాడుతోంది. ఇది అతని జీవితంలో గందరగోళానికి దారి తీస్తుంది. కాన్సెప్ట్ ను ఆసక్తికరంగా ఆవిష్కరించడంతో ఈ కాంబోలో క్రేజీని ఆశించవచ్చు.
ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని 2025లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం సరిపోదా శనివారం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా పూర్తవడంతోనే డీవీవీ ప్రొడక్షన్ లో మూవీని ప్రారంభిస్తారు. షూటింగ్ కూడా సరిపోదా శనివారం రిలీజ్ తర్వాత ప్రారంభమవుతుందని తెలుస్తోంది. నాని ఈ సినిమాలో ఉండగా మేకర్స్ మిగతా తారాగణంను తీసుకుంటారని తెలుస్తోంది.
సరిపోదా శనివారంలో ప్రియాంక అరుల్ మోహన్ ప్రధాన పాత్రలో, ఎస్జే సూర్య ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ను కూడా DVV దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుంది. జేక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ మూవీ 29 ఆగస్ట్, 2024న వరల్డ్ వైడ్ గారిలీజ్ కాబోతోంది.