Pawan Kalyan Sensational Comments : ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు బెయిల్ లభించింది. హైకోర్టు ఈ మేరకు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈనేపథ్యంలో ఆయనకు బెయిల్ దొరకడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఆయన సేవలు రాష్ట్రానికి అవసరమని పేర్కొన్నారు. ఆయన రాక రాష్ట్రానికి ఎంతో మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాలకు ఆయన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు.
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జైలు నుంచి విడుదల అవుతారు. అక్కడి నుంచి ఎయిర్ పోర్టు వరకు ర్యాలీగా వెళతారు. ప్రత్యేక విమానంలో విజయవాడలోని తన ఇంటికి చేరుకుంటారు. తరువాత విమానంలో తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడ నుంచి హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి చేరుకుని చికిత్స తీసుకుంటారు.
కొద్ది రోజులుగా చంద్రబాబు విడుదలపై నిరసనలు వెల్లువెత్తాయి. పార్టీతో పాటు ఇతరులు కూడా బాబును విడుదల చేయాలని ముక్తకంఠంతో కోరారు. ఏడు పదుల వయసులో ఆయనను జైలులో ఉంచడం సురక్షితం కాదనే వాదనలు వచ్చాయి. కానీ వైసీపీ మొండి వైఖరితోనే ఇన్నాళ్లు జైలులో ఉంచినట్లు స్పష్టమవుతోంది. ఏది ఏమైనా బాబు విడుదల కావడంపై అందరిలో సంతోషం కలుగుతోంది.
చంద్రబాబు విడుదలను చాలా మంది స్వాగతిస్తున్నారు. మచ్చలేని నాయకుడిని దురుద్దేశంతోనే జైలులో పెట్టారని నిరసన తెలిపారు. ఆయన విడుదల కోసం రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. ఇంకా విడుదల చేయకపోతే నిరసనలు ఇంకా పెరిగేవి. పరిస్థితి చేయి దాటి పోతుందనే కారణంతో బాబును జైలు నుంచి విడుదలకు మొగ్గు చూపినట్లు సమాచారం.