Pawan Kalyan : జనసేన పార్టీ అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవనిగడ్డ, పాల కొండ, విశాఖ సౌత్ ,అసెంబ్లీ స్థానాలు, బందరు ఎంపీ సీటుకు అభ్యర్థుల్ని జనసేన ప్రకటన చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే.
దీనిపై నాలుగు రోజుల నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మల్ల గులాలు పడుతున్నట్లు సమా చారం అందుతోంది. ఇప్పటికే ఆయా సీట్ల ఆశా వహులు ఆయనతో పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. నేడు మరోసారి పార్టీ కార్యవర్గంతో చర్చించిన అనంతరం జనసేనాని జాబితా ను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
పొత్తు నేపథ్యంలో సీట్ల పంపకం తలనొప్పిగా మా రింది. కొత్తలో కొన్ని సీట్లు కోల్పోవాల్సి రావడం ఉన్న దానిలో ఎవరికి సీటు కేటాయించాలన్న దానిపై జనసేన నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి టికెట్ ఇస్తే మంచిదని భావిస్తున్నారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి అభ్యర్థుల ఎంపిక పై నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది.