Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీకి రాజీమానా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్టానం నియమించినప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. చాలా సార్లు ఈ ఎన్నికను వ్యతిరేకించాడు. పార్టీలో సీనియర్ నేతలు ఉండగా వలస వచ్చిన నాయకుడికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించడంపై గొడవకు దిగాడు. ఆ తర్వాత కాంగ్రెస్ లో ఉండలేక బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఆయన మునుగోడుకు ఎమ్మెల్యేగా ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో ఊపుమీదున్న బీజేపీలో చేరిన ఆయన స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు రాజగోపాల్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ బండిని పక్కన పెడితే పార్టీని పవర్ లోకి తేవడం అసాధ్యం అంటూ చెప్పారు.
ఇవన్నీ కొనసాగుతున్న సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం.. తెలంగాణలో ఊపుమీదకు రావడంతో ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాజగోపాల్ రెడ్డి అన్నతో చాలా సార్లు సంప్రదింపులు చేశారు. పార్టీ అధిష్టానం కూడా ఆయనను ఆహ్వానించడంతో కాంగ్రెస్ లోకి వెళ్తారన్న లీకులు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు (అక్టోబర్ 25) బీజేపీకి రాజీనామా చేశారు. ఎల్లుండి (శనివారం) ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు ప్రత్యాన్మాయం కాంగ్రెస్ మాత్రమే అని ఆయన చెప్పారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న ఆయన బీజేపీ బీఆర్ఎస్ ను ఎదుర్కోలేదని చెప్పుకచ్చారు.