Ramcharan :
దాదాపు ఐదేళ్ల తర్వాత హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన సినిమా థియేటర్లలో సందడి చేయబోతుంది. ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో అనుష్క శెట్టి లీడ్ రోల్ చేస్తుండగా నవీన్ పోలిశెట్టి హీరోగా కన్పిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా నేడు(సెప్టెంబర్ 7న) ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ పోలిశెట్టి అంతా తానై ముందుకు నడిపిస్తున్నారు. సినిమా విడుదల తేది దగ్గర పడిన నేపథ్యంలోనే అనుష్క శెట్టి సైతం తనదైన శైలిలో సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘రెసిపీ ఛాలెంజ్’ను అనుష్క శెట్టి ఎంచుకున్నారు. మంగళూరు చికెన్ కర్రీ.. నీర్ దోశె వంటకాలు తనకు ఇష్టమని.. ఇది ఎలా చేయాలో వివరించింది. ఆ తర్వాత తనకు అత్యంత ఆప్తుడైన ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఛాలెంజ్ ను విసిరింది.
అనుష్క ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రభాస్ తనకు రొయ్యల పలావ్ అంటే ఇష్టమని చెబుతూ అది ఎలా తయారు చేయాలో చెప్పుకొచ్చాడు. అనంతరం తన ఫ్రెండ్ రాంచరణ్ కు రెసిపి ఛాలెంజ్ ను విసిరాడు. ప్రభాస్ ఛాలెంజ్ ను స్వీకరించిన గ్లోబల్ స్టార్ రాంచరణ్(చెర్రీ) తన ఫేవరెట్ రెసిపీ నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చెప్పుకొచ్చాడు.
తన ఫ్రెండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు ఛాలెంజ్ విసిరాడు. ప్రభాస్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన రామ్ చరణ్ తన ఫేవరెట్ రెసిపీ నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చెప్పుకొచ్చాడు.అనంతరం తన ఫ్రెండ్ దగ్గుబాటి రానాకు రెసిపీ ఛాలెంజ్ ను విసిరాడు. దీంతో ఇప్పుడు రెసిపీ చేయడం రానా వంతుగా మారింది.
దీంతో రానా ఫేవరేట్ రెసిపీ ఏంటీ.. ఎలా చేస్తాడు.. తన తర్వాత ఎవరికీ ఛాలెంజ్ విసురుతాడోనని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఏదిఏమైనా అనుష్క మొదలు పెట్టిన రెసిపీ ఛాలెంజ్ స్టార్ హీరోల చుట్టూ తిరుగుతూ ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ మూవీకి మంచి పబ్లిసిటీ తెచ్చిపెడుతోంది.