Team India Key Player : వన్డే వరల్డ్ కప్ 2023 మొదలైంది. గురువారం న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. న్యూజిలాండ్ తొలి మ్యాచ్ లో నెగ్గింది. ఇక భారత్ కూడా ఈ నెల 8న తన తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే జట్టు చెన్నైకి చేరుకుంది. ఇక తొలి మ్యాచ్ కు ముందే టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. కీలక ఆటగాడు, ఓపెనర్ కూడా అయిన శుభ్ మన్ గిల్ జట్టుకు దూరమయ్యాడు. డెంగీ పాజిటివ్ రావడంతో ఆయన తొలి మ్యాచ్ ఆడడం సందేహంగానే కనిపిస్తున్నది. భీకర ఫామ్ లో ఉన్న శుభ్ మన్ గిల్ ఈ మ్యాచ్ కు దూరమవడం కొంత ఇబ్బందికర పరిస్థితే.
అయితే ఇప్పుడు శుభ్ మన్ గిల్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరనే ప్రశ్న తలెత్తుతున్నది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో భారత్ తన తొలి మ్యాచ్ అగ్రశ్రేణి జట్టు ఆస్ర్టేలియాతో తలపడనున్నది. ఇక ఒకరిద్దరు ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే గాయాల నుంచి కోలుకున్నారు. ఈ సమయంలో గిల్ డెంగీ బారిన పడడం భారత అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇప్పడు రోహిత్ తో కలిసి ఓపెనింగ్ భాగస్వామ్యం ఎవరు చేస్తారనే ప్రశ్న వస్తున్నది . అయితే ప్రముఖంగా ఇషాన్ కిషన్ పేరు వినిపిస్తున్నది. అయితే గిల్ జ్వరంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కానీ డెంగీ అనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించలేదు.
కానీ కీలక ఆటగాడు తొలిమ్యాచ్, అందులోనే ఆస్ర్టేలియాతో పోరుకు దూరమవడం ఇప్పుడు రోహిత్ సేనకు కొంత కష్టంగానే కనిపిస్తున్నది. అయితే ఈ స్థానాన్ని ఇక ఇషాన్ కిషన్ తో భర్తీ చేయనున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో గిల్ కోలుకుంటాడా లేదా అనేది అనుమానంగానే కనిపిస్తున్నది. మరోవైపు చెన్నైలో తొలి మ్యాచ్ కోసం భారత అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.