టీమిండియా కీలక బ్యాట్స్ మెన్ సడెన్ గా ముంబై చేరుకున్నాడు. జట్టుతో తిరువనంతపురం రాకుండా ఇంత హఠాత్తుగా కోహ్లీ ముంబై ఎందుకు వెళ్లాడనేది అంతు చిక్కడం లేదు. మేనేజ్ మెంట్ అనుమతితోనే ఆయన ముంబై వెళ్లినట్లు సమాచారం. వ్యక్తిగత అత్యవసర కారణాలతో అతడు జట్టును వీడి, ముంబై కి చేరినట్లు సమాచారం. అయితే సోమవారం సాయంత్రానికల్లా విరాట్ జట్టును చేరుకుంటాడని తెలుస్తున్నది.
అయితే విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ రెండోసారి తల్లి కాబోతున్నట్లు సమాచారం. ఇటీవల వీరిద్దరూ ముంబైలోని ఓ గైనకాలజీ దవాఖానలో కనిపించడం ఈ వార్తలకు ఊతమిచ్చింది. 2017లో కోహ్లీ, అనుష్క జంటలకు వివాహం కాగా, వీరికి 2021 జనవరిలో వామిక జన్మించింది. ఇఫ్పుడు మరోసారి విరాట్ తండ్రి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక గుహవాటి వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ తొలి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ప్రపంచకప్ టోర్నీకి ముందు రెండో వార్మప్ మ్యాచ్ మంగళవారం తిరువనంతపురం లో జరగనుంది. నెదర్లాండ్స్ తో జరిగే ఈ వార్మప్ మ్యాచ్ కు కూడా వాన ముప్పు పోలి ఉంది. ఇక ప్రపంచకప్ లో తొలి మ్యాచ్ అక్టోబర్ 8న అస్ర్టేలియాతో టీమిండియా ఆడనుంది.