kalvakuntala Gang : తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కల్వ కుంట్ల బ్యాచ్ చేసిన టెలిఫోన్ ట్యాపింగు కుంభ కోణంలో అనేక భయానక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలోని అత్యంత సంపన్నులైన అనేకమంది రాజకీయ ప్రముఖులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కాంట్రాక్టర్లు, బిల్డర్లు రియల్టర్లు, సినీనటీనటులు, ఫైనాన్సియర్లు, న్యాయమూర్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఉన్నతాధికారులు, సెలబ్రిటీలు, మీడియాసంస్థల అధినేతలు యజమానుల కుటుంబసభ్యులు, ఎడిటర్లు జర్నలిస్టులు కవులు కళాకారుల ఫోన్లను వారి ఇళ్లల్లోని మహిళల టెలిఫోన్లను వాట్సప్ చాటింగ్ లో ఆడియో కాల్స్ ట్యాపింగ్ చేసి కల్వకుంట్ల గ్యాంగ్ వేలాది కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
చాలామంది తమకు జరిగిన విషయాన్ని బయ టకు ఎవరితో చెప్పుకోలేక సతమతమ య్యారని, నిద్రలేనిరాత్రులు గడిపారని, ఆ విషయాలు బయ టకు తెలిస్తే కుటుంబాలు కూలిపోతాయని, పరు వుమర్యాదలు మంటగలిసి చివరకు ఆత్మహత్యలే శరణ్యం అవుతాయని భయపడి కల్వకుంట్ల గ్యాంగుకి అడిగినంత కప్పం కట్టారని తెలుస్తోంది, ఈవిధంగా గత ఐదేళ్లుగా కల్వకుంట్ల దొంగల ముఠా ఏకచత్రాధిపత్యం వహించిందని అంటున్నారు.