Extra-marital Relationship : వివాహేతర సంబంధం పెట్టకుంది భార్య.. ఈ విషయంపై తరుచూ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. భర్త చాలా సార్లు చెప్పి చూసినా ఆమె పద్ధతి మార్చుకోలేదు. దీంతో కోపోద్రేకుడైన భర్త ఆమెపై దాడి చేశాడు. ఏ అందంతో అయితే వివాహేతర సంబంధం కొనసాగిస్తుందో అదే అందంను ఆమెకు దూరం చేశాడు.. అసలేం జరిగిందంటే?
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకా శిశిల గ్రామంలో సురేశ్ కుటుంబం నివసిస్తుంది. సురేశ్ భార్య కొన్ని రోజులుగా వివాహేతర సంబందం కొనసాగిస్తుంది. ఈ విషయంపై తరుచూ వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. వివాహేతర సంబంధం పెట్టుకొని తనను మోసం చేస్తుందని కొన్ని రోజులుగా పగతో రగలిపోతున్నాడు సురేశ్.
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకున్న భర్త భార్యపై పైశాచికంగా దాడి చేశాడు. ఆమె చెంపలు, కన్నులను కొరికేశాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తల్లిని రక్షించేందుకు వచ్చిన కూతురిపై కూడా సురేశ్ దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో ఆందోళనకు గురైన సదరు యువతి ప్రాణాలను కాపాడుకునేందుకు పరారైంది. ఈ విషయం ఇరుగు పొరుగుకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చే సమయానికి సురేష్ అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో స్థానికులు ఆమెను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు.
బెల్తంగడిలోని ధర్మస్థల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సురేశ్ కు తన భార్యపై అనుమానం ఉందని పోలీసులు చెప్పారు. తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని తనను మోసం చేస్తోందని సురేష్ గౌడ రగిలిపోయాడని ఇదే విషయంలో గొడవలు జరుగుతున్నాయని పోలీస్ దర్యాప్తులో తేలింది.
పద్ధతి మార్చుకోవాలని సురేష్ ఎన్ని సార్లు చెప్పినా ఆమె వినడం లేదని సురేష్ గౌడ అతని స్నేహితులతో చెప్పేవాడని పోలీసులు అంటున్నారు. ప్రియుడితో జల్సా చేస్తుందని రగిలిపోయిన ఆయన చెంపలు కొరికి ముఖం ఛిద్రం చేసి, కన్ను కూడా కొరికేశాడని అధికారులు తెలిపారు.