Gemini Ganesan : సినిమాల్లో రొమాంటిక్ పాత్రలు చేసి కింగ్ ఆఫ్ రొమాన్స్ గా పేరు తెచ్చుకున్న నటుడు జెమినీ గణేషన్. మూడు పెళ్లిళ్లు చేసుకుని తన హవా కొనసాగించాడు. 1971లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందజేసింది. 1947లో మిస్ మాలిని చిత్రంతో తెరంగేట్రం చేశాడు. తన సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. తన నటనతో అందరిని మెప్పించాడు.
ప్రముఖ హీరోయిన్ రేఖ ఆయన కూతురే. రాధ కూడా ఆయన వారసురాలే. ఇలా తన కూతుళ్లు కూడా హీరోయిన్లుగా రాణించారు. జెమినీ గణేషన్ జీవితమంతా వివాదాలే. మహానటి సావిత్రిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వివాహేతర సంబంధాలతో కొన్నాళ్లు వార్తల్లో నిలిచారు. అప్పటి నటి సావిత్రితో కూడా ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకున్నాడు.
1998లో జానియానా అండ్రూను మూడో వివాహం చేసుకున్నాడు. కింగ్ ఆఫ్ రొమాన్స్ అని పిలవడం అతడికి ఇష్టం లేదు. అతడికి ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మొదటి భార్యకు నలుగురు కుమార్తెలు, సావిత్రికి ఒక కుమార్తె, కుమారుడు కలిగారు. జెమినీ గణేషన్ కూతురు రేఖ కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, కిరణ్ కుమాార్, వినోద్ మెహ్రా, సంజయ్ దత్ వారిలాగే రేఖ జీవితం కూడా వివాదాస్పదంగానే సాగింది. రేఖ తండ్రి థాయ్ ఉల్లం చిత్రంలో విలన్ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1954లో వచ్చిన మనం పోల మాంగళ్యం సినిమాలో ప్రధాన పాత్ర పోషించి స్టార్ గా మారాడు. ఐదు దశాబ్దాల కెరీర్ లో 200 సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు.