Hardik Pandya : టీమిండియా విజయాల జోరు కొనసాగిస్తోంది. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయదుందుభి మోగించింది. ఆఖరి మ్యాచ్ లో ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. తక్కువ స్కోరు చేసిన బౌలింగ్ లో అదరగొట్టింది. అద్భుతమైన ప్రతిభతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఆరు మ్యాచుల్లోనూ తిరుగులేదని నిరూపించింది. నవంబర్ 2న శ్రీలంకతో మరో మ్యాచ్ జరగనుంది.
ఈ నేపథ్యంలో టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా జట్టులోకి ఈ మ్యాచ్ లో రానున్నాడని సమాచారం. లీగ్ దశలో శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తో ఆడాల్సి ఉంది. వాటిని కూడా ఓడించి టీమిండియా తిరుగులేని శక్తిగా ఎదగాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా సెమీ ఫైనల్ కు పాండ్యా అందుబాటులో ఉంటాడని చెబుతున్నారు.
నవంబర్ 2న ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇంగ్లండ్ తో లక్నోలోని అటల్ బిహారీ ఏక్నా స్టేడియంలో ఇంగ్లండ్ ను రోహిత్ సేన ఓడించింది. తొమ్మిది వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 87 పరుగులతో చెలరేగిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ 49, రాహుల్ 39 పరుగులు చేశాడు.
ఇంగ్లండ్ ను 129 పరుగులకే ఆలౌటైంది. షమీ 4, బుమ్రా 3 వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్ 2, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు. టీమిండియా విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఈ సారి వరల్డ్ కప్ సాధించి తీరుతుందనే దీమాలో ఉంది. ప్రేక్షకులు కూడా అదే కోరుకుంటున్నారు. ఎలాగైనా ఈ మారు కప్ కొట్టాల్సిందేననే కసితో ఉందని తెలుస్తోంది.