Mumbai Indians : ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ లో పెను మార్పులు జరుగుతున్నాయి. కెప్టెన్ గా హిట్ మ్యాన్ రోహిత్ ను తప్పించడంపై ముంబై ఓనర్స్ పై ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇక నుంచి తాము ముంబై మ్యాచ్ లను చూడమని, దానికి స్పాన్సర్ చేసే కంపెనీల ఉత్పత్తులను కూడా వాడమని వార్నింగ్ ఇస్తున్నారు. రెండు మూడు రోజులుగా క్రికెట్ లో రోహిత్ ను తప్పించడం.. పాండ్యాకు బాధ్యతలు అప్పగించడంపైనే చర్చ జరుగుతోంది.
తాజాగా ముంబై ఇండియన్స్ పై మరో షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. రోహిత్ ను తప్పించడంపై ఆగ్రహంగా ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా ముంబై ఇండియన్స్ మెంటార్ పదవికి రాజీనామా చేయనున్నట్టు, తన నిర్ణయాన్ని ఓనర్స్ కు తెలియజేసినట్టు ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
అయితే ఈ విషయంపై జాతీయా మీడియా సచిన్ ను సంప్రదించినట్టు తెలిసింది. అయితే అవన్నీ రూమర్స్ అని సచిన్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే సీజన్ లోకూడా సచిన్ ముంబై ఇండియన్స్ కు మెంటార్ గా ఉంటారని తెలుస్తోంది. కాగా, సచిన్ 2014 నుంచి ఆ జట్టుకు మెంటార్ గా ఉంటున్నారు. అంతకుమందు 5 సీజన్ల పాటు ఆ జట్టుకు ప్రాతినిధ్య వహించారు.