RGV In Kalki :
వైజయంతీ మూవీస్ బ్యానర్లో దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కల్కీ 2898 ఏడీ’. ఈ సినిమాలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్.. బిగ్ బీ అమితాబచ్చన్.. విశ్వనటుడు కమల్ హాసన్.. వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అపేడ్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలై ‘కల్కీ’పై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. తాజాగా కల్కీ 2988 ఏడీ షూటింగ్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అతిథి పాత్రలో కన్పించనున్నారట. ఆయనకు సంబంధించిన షూటింగ్ సైతం తాజాగా పూర్తయిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన ఇమేజ్ లు సైతం కొన్ని ట్విటర్లో కన్పించాయి.
కాగా గతంలోనూ అగ్ర దర్శకుడు రాజమౌళి సైతం ‘కల్కీ’ షూటింగులో పాల్గొన్నారని వార్తలు వచ్చాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ సైతం ఈ సినిమాలో కనిపించనున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. ఈ ఇద్దరు దర్శకులు సినిమాలో ఉన్నారా? లేదా అనే క్లారిటీని మాత్రం ‘కల్కీ’ టీం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.