మనకు తాగునీరు చాలా అవసరం. దీంతో ఆ నీటిని ఎందులో తాగాలి? రాగి పాత్రలో తాగాలా? మట్టికుండలో నీరు మంచిదా అనే దానిపై చర్చ సాగుతోంది. రెండింటిలోనూ మంచి గుణాలే ఉన్నాయి. రెండు మనిషికి కావాల్సిన వస్తువులే. మట్టికుండలో నీరు చల్లగా ఉంటుంది. ఆ నీరు తాగడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
రాగి పాత్ర వల్ల మనకు ఎన్నో లాభాలున్నాయి. అందులో ఉండే ఖనిజాల వల్ల రాగి మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది. దీంట్లో నీరు తాగడం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. రాగి పాత్రలో రాత్రి నీరు పోసుకుని ఉదయం పూట తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే రాగిని రోజు వాడుకుని నీళ్లు తాగడం మంచిదే.
మట్టి కుండలో శీతలీకరణ లక్షణం ఉంటుంది. దీని వల్ల అందులో పోసిన నీరు మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎండాకాలంలో మట్టి కుండ, వర్షా, చలికాలాల్లో రాగి పాత్ర వాడుకుంటే మంచిది. అందుకే మట్టి కుండ మన ఆరోగ్యాన్ని చల్లంగా ఉంచుతుంది. ఫ్రిజ్ వాటర్ అసలే తాగొద్దు. దీని వల్ల అనేక నష్టాలు వస్తాయని చెబుతున్నారు. కానీ మనలో చాలా మంది ఫ్రిజ్ లను వాడటానికి ఇష్టపడుతున్నారు.
ఈ నేపథ్యంలో రాగి, మట్టి కుండల ప్రాధాన్యం విషయంలో రెండు సమ ఉజ్జీలుగా నిలుస్తాయి. ఆరోగ్యం విషయంలో రెండింట పాత్ర కీలకమే. దీంతో వాటిని ఉపయోగించుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి అందరు రాగి, మట్టి కుండలను వాడుకోవాలని వైద్యులే చెబుతున్నారు. వీటిని వాడుకుంటే ఎంతో మంచిదని సూచిస్తున్నారు.