Chandrababu : ప్రకాశం జిల్లా కనిగిరిలో రా.. కదలిరా.. కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగు జాతికి పూర్వైభవం వస్తుందని చంద్రబాబు అన్నారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగలే దన్నారు. రాష్ట్రంలో 9 సార్లు కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై భారం వేశారన్నారు. మద్యం, మైన్స్ లో లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని చంద్ర బాబు ఆరోపించారు. నాసిరకం మద్యమాన్ని అమ్మి జనం ప్రాణాలతో జగన్ చెలగాట మాడు తున్నాడనీ బాబు అన్నారు .
ఈ దుర్మార్గుడు జలగలాగా పట్టిపీడిస్తున్నాడనీ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ఓడిపోతు న్నాడని అర్థం అయ్యి మంత్రులు, ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నాడన్నారు. జగన్ రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకుపోయాడని చంద్రబాబు ఆరోపించారు. నన్ను, లోకేష్ ,పవన్ కళ్యాణ్ ని తిట్టిన వారికే జగన్ సీట్లు ఇస్తానని చెప్పడం చూస్తే మనల్ని చూసి భయప డుతు న్నాడని అర్థమవుతుందన్నారు.
తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందేలా చేస్తామని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తాం అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం మని హామీ ఇచ్చారు. వెనుకబడిన కనిగిరిని గుర్తుపెట్టుకుంటానని ఇక్కడి యువతకు ఉపాధి కల్పించే విధంగా వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానని చంద్రబాబు తెలిపారు.