nandamuri balakrishna సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే తేలికైన విషయం కాదు.. ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయడానికి చాలా కష్టపడాలి.. ఈ గ్లామరస్ ఫీల్డ్ లో కొనసాగాలి అంటే ఖచ్చితంగా ఎక్స్పోజింగ్ అనేది చేయాలి అన్నట్టు ఇప్పుడు పరిస్థితులు నెలకొన్నాయి.. ఎక్స్పోజింగ్ చేస్తేనే హీరోయిన్స్ మనుగడ ఎక్కువ కాలం ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం..
ఎవరో ఒకరు ఎక్స్పోజింగ్ లేకుండానే కేవలం నటన మీద ఆధారపడి ఉంటారు. అయితే అలాంటి వారికీ ఆశించినంత అవకాశాలు రావు అనే చెప్పాలి.. అందుకే హీరోయిన్స్ అంతా గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు. టాలెంట్ తో పాటు గ్లామర్ కూడా చూపిస్తేనే ఛాన్సులు అందుకుంటారు అని హీరోయిన్స్ నమ్ముతారు.
అయితే ఈ ఎక్స్పోజింగ్ మీద నందమూరి నటసింహం గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతూన్నాయి.. ఆయన అన్ స్టాపబుల్ షో చేసే సమయంలో జయసుధ, జయప్రద, రాశి ఖన్నా ముగ్గురు తన షోలో విచేసినప్పుడు ఆయన ఎక్స్పోజింగ్ గురించి అడుగగా వీరు కాస్త తడబడ్డారు.
అప్పుడు బాలయ్య మాట్లాడుతూ.. నటిగా ఎదగాలంటే డైరెక్టర్లు ఎదో చెప్పిన సరే కథకు అవసరం అయితే చేయాల్సిందే.. అప్పుడే ఇండస్ట్రీలో కొన్నాళ్ల పాటు రాణిస్తారు.. అది హీరో అయిన హీరోయిన్ అయిన కథకు కావల్సినది అయితే చేయాల్సిందే.. దీంతో ఈయన మాటలను బట్టి ఎక్స్పోజింగ్ ను ఈయన కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది..