Naga Chaitanya: నాగచైతన్య, చందూ మొండేటి కాంబినేషన్ లో ఓ గ్రామీణ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య వైజాగ్ వెళ్లి మత్స్యకారుడిని కలవడంతో కొద్ది రోజుల క్రితం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ప్రారంభమైంది. ఈ సినిమాలో ఆయన మాస్ జాలారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే అక్టోబర్ 20 నుంచి ఈ సినిమా షూటింగ్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. జీఏ-2 పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
ఇంకా హీరోయిన్ ఎవరనేది తెలియలేదు. అయితే, కీర్తి సురేష్, సాయిపల్లవి మధ్యే రేసు నడుస్తోందని ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోంది. మరి ఫైనల్ లిస్ట్ లో ఏ హీరోయిన్ చేరుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ హీరోయిన్లతో నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారు.
ఒక వేళ సాయి పల్లవి సెలక్ట్ అయితే.. లవ్ స్టోరీ తర్వాత సాయి పల్లవి మరోసారి నాగ చైతన్యతో జతకట్టాలని అభిమానులు కోరుకుంటుండగా, మరికొందరు మాత్రం నాగ చైతన్య అక్కినేనితో మంచి జోడీగా కీర్తి సురేశ్ ను తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.