ఉక్రెయిన్ లో ఉంటున్న భారతీయులకు వార్నింగ్ ఇచ్చింది భారత ప్రభుత్వం. ఉక్రెయిన్ లో ఉంటున్న భారతీయులు తక్షణమే ఆ దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సహాయం కోసం భారత ఎంబసీ అధికారులను సంప్రదించాలని , సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కోరింది. ఉక్రెయిన్ పై గత 9 నెలలుగా రష్యా యుద్ధం చేస్తూనే ఉంది. అయితే ఇటీవల కొంత విరామం ఇచ్చిన రష్యా మళ్ళీ భీకర దాడులకు తెగబడటంతో ఉక్రెయిన్ లో ఉంటున్న భారతీయులను ఆ దేశం విడిచి వెళ్లాల్సిందిగా భారత్ కోరింది.