2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ , వైఎస్ షర్మిల ల హత్య జరుగనుందని సంచలన వ్యాఖ్యలు చేసాడు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి. ఇంతకుముందు 2019 ఎన్నికలకు ముందు తొలుత వైజాగ్ లో కోడికత్తి సంఘటన జరిగిందని , ఆ తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందని ఆ సానుభూతితో 2019 ఎన్నికల్లో జగన్ విజయం సాధించాడని , ఇక ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ , వైఎస్ షర్మిలను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి బాంబ్ పేల్చాడు.
డీఎల్. రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన డీఎల్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కొన్నాళ్ళు స్నేహం , ఆ తర్వాత తీవ్ర విరోధం ఉండేది. అయితే ఆ తర్వాత రాజీ పడ్డారు. అయితే వైఎస్ జగన్ తో మాత్రం మొదటినుండి కూడా బద్ద విరోధం ఉంది. కుటుంబాల పరంగా కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వ్యతిరేకత ఉంది.
జగన్ ముఖ్యమంత్రి కావడంతో రాజకీయంగా సైలెంట్ అయిపోయాడు డీఎల్ రవీంద్రా రెడ్డి. ఏపీలో మరో ఏడాదిలోనే అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో డీఎల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై అటు విజయమ్మ , షర్మిల , ఇటు జగన్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.