అధికార పార్టీ వైసీపీకి గట్టి షాకిచ్చారు కాపులు. ఉత్తరాంధ్ర ఓటర్లు అందునా కాపులు సైతం జగన్ కు గట్టి షాక్ ఇచ్చారు. వైజాగ్ ను రాజధాని చేసున్నామని ఇక్కడనుండే పరిపాలన అందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతున్నప్పటికీ ఓటర్లు మాత్రం జగన్ మాటలను పక్కన పెట్టి , తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ వాళ్లు తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపడం విశేషం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అడుగడుగునా ఇబ్బంది పెడుతుండటం కూడా కాపులకు తీవ్ర ఆగ్రహం కలిగించిందని అందుకే ఏపీ అంతటా కాపులు గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు. ఉత్తరాంధ్ర కాపులు మాత్రమే కాదు రాయలసీమ అలాగే కోనసీమ ఓటర్లు ఇలా కాపులంతా వైసీపీకి గట్టి షాకిచ్చారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మదిలో తెలుగుదేశం మెదులుతోంది కాబట్టి బయట ఎక్కడా చెప్పకపోయినా తమ నాయకుడి మనోగతం తెలుసుకొని తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు.
అంతేకాదు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును అలాగే నారా లోకేష్ ను ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా చాలా ఇబ్బందులు పెడుతూ అక్రమ కేసులు పెద్ద ఎత్తున పెడుతుండటం కూడా జగన్ సర్కారుకు ఓటు తోనే బుద్ది చెప్పాలని డిసైడ్ అయ్యారు ఓటర్లు అందునా కాపులు. దాంతో వైసీపీ కి దారుణమైన ఓటమి లభించింది.