వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని 25 వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ పై జారీ చేసింది.25 వ తేదీన వాదనలు వినిపించనున్న సిబిఐ బలమైన ఆధారాలు సమర్పించి బెయిల్ ను రద్దు చేయాలి అని కోరే అవకాశం ఉండే అవకాశం ఉంది.
సీబీఐ కస్టడీలో ఉన్న భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ను విచారిస్తున్న సీబీఐ వాళ్ళ నుంచి బలమైన ఆధారాలు సేకరించినట్లు సమాచారం. హత్య\ జరిగిన ప్రదేశంలో భాస్కర్ రెడ్డి ఉన్నట్లు సిబిఐ భావిస్తుంది. భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నట్టు సునీల్ యాదవ్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి.. అంటే భాస్కర్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు ఇద్దరు ఒకే దగ్గర ఉన్నట్టు సీబీఐ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి ,,
ముందుగా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇద్దరినీ ఒకేసారి విచారించాలని సీబీఐ భావించింది.. అయితే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి అవినాష్ రెడ్డి కి నోటీసులు ఇచ్చే లోపే అవినాష్ రెడ్డి తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు..
26న పక్కా ఆధారాలు చూపించి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కేసును ఒక కొలిక్కి తేవాలని సీబీఐ భావిస్తుంది.అప్రూవర్ గా మారిన దస్తగిరి నుంచి సునీల్ యాదవ్ నుంచి సేకరించిన ఆధారాలు కోర్టుకు సమర్పించి అవినాష్ రెడ్డి ని కస్టడీకి కోరే అవకాశం ఉంది, అదే జరిగితే అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయంగా కనిపిస్తుంది,,
కోర్టు ముందు సీబీఐ వాదనలు ఎలా ఉండనున్నాయి .. అవినాష్ రెడ్డి బెయిల్ ను కోర్టు రద్దు చేస్తుందా… అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందా.. అనే విషయం తేలాలి అంటే 25 వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే..!