ప్రస్తుతం అప్రూవర్గా మారిన దస్తగిరి చెబుతున్న వివరాలు రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్నాయి. అయితే దస్తగిరి ఏరకమైన వివరాలు చెప్పినప్పటికీ..వివేకా నందా రెడ్డి మర్డర్ కేసుపై ఓ స్పష్టత మాత్రం రావడం లేదు. వివేకా హత్య వ్యవహారాన్ని కడప ఎంపీ,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరుడు అవినాష్ రెడ్డి దగ్గర్నుంచి పర్యవేక్షించాడనే ఆరోపణలున్నాయి. సీబీఐ కూడా వివేకా మర్డర్ కేసులో అవినాష్ రెడ్డినే ప్రధానంగా టార్గెట్ చేస్తోంది.
అయితే సీబీఐ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఇప్పటి వరకు వివేకానందా రెడ్డిని ఎవరు హత్య చేశారనే అంశం తేలడం లేదు. ఈ నేపథ్యంలోనే కొత్త అంశం తెరపైకి వస్తోంది. వివేకా మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న నిందితులందరికి నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించాలనే డిమాండ్ వినిపిపిస్తోంది.