ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు వచ్చింది. ఈడీ దూకుడు పై అలాగే మోడీ ప్రభుత్వం పై విరుచుకుపడింది. ఒక మహిళను విచారించాలంటే ఆమె ఇంటికి వచ్చి అధికారులు విచారణ చేయాల్సి ఉంటుంది. ఈ క్లాజ్ చట్టంలో ఉంది. అయినప్పటికీ ఈడీ అధికారులు మాత్రం నన్ను తమ కార్యాలయానికి మాత్రమే రావాలని అంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతవాళ్లను తీసుకొని మా ఇంటికి రండి ఇక్కడే విచారణ చేయండని లేఖలో కోరాను అందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఈనెల 9 నే విచారణకు రావాలని కోరారు. దాంతో నేను ఈనెల 11 న ఈడీ ముందుకు వెళ్తున్నానని తెలిపింది కవిత.
మోడీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, బీజేపీ ప్రభుత్వం లేని చోట్లకు మోడీ వచ్చే ముందు ఈడీ ని పంపిస్తున్నారని గత 8 నెలలుగా తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థలను పంపిస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది కవిత.
బి ఎల్ సంతోష్ ను తెలంగాణకు పంపించి కేసీఆర్ సర్కారును కూలదోయాలని కుట్ర పన్నారని, ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బిఎల్ సంతోష్ కు నోటీసులు పంపిస్తే విచారణకు రాకుండా దొంగ నాటకాలు ఆడారని కానీ నేను ఎలాంటి తప్పు చేయలేదు కనుక విచారణకు వచ్చానని కవిత స్పష్టం చేసింది.