మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నివాసంలో ఉగాది వేడుకలు జరిగాయి. కాగా ఆ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ , ఏపీ గవర్నర్ నజీర్ అహమ్మద్ తో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు , పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నాడు.
దాంతో రాష్ట్ర గవర్నర్ నజీర్ కు యార్లగడ్డను పరిచయం చేస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నేను యార్లగడ్డ అప్పట్లో ఉద్యమించామని పరిచయం చేశాడు. తెలుగు వాళ్లకు ఇష్టమైన పండగ ఉగాది . దాంతో సంప్రదాయ సిద్ధంగా ఈ వేడుకలను నిర్వహించారు వెంకయ్య. ఉగాది పండుగకు రెండు రోజుల ముందే వేడుకలను ఢిల్లీలోని తన నివాసంలో ఘనంగా నిర్వహించారు.