Rohit Sharma : ఐపీఎల్ 17 సీజన్ ను ముంబై ఓటమితో ప్రారంభించిన విషయం తెలిసిందే. మార్చి 27న (నేడు) మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ హైదరాబాద్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో నెగ్గి పాయింట్ల ఖాతాను తెరువాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఆల్రెడీ మ్యాచ్ కూడా స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తోంది.
కాగా, ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ తో ముంబై తరపున అతడు 200 మ్యాచ్ లు పూర్తి చేసుకోబోతున్నాడు. ఐపీఎల్ లో ఒక ఫ్రాంచైజీ తరుపున 200లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడిన మూడో క్రికెటర్ గా రోహిత్ నిలువనున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ(239 మ్యాచ్ లు, బెంగళూరు), ధోనీ (221, చెన్నై) రోహిత్ కంటే ముందున్నారు.
హిట్ మ్యాన్ 2011 నుంచి ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పటివరకు 199 మ్యాచ్ లు ఆడి 5084 పరుగులు చేశాడు. ముంబై తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా రోహితే. 2013 సీజన్ మధ్యలో ముంబై పగ్గాలు అందుకున్న రోహిత్ ను జట్టును ఐదు సార్లు చాంపియన్ గా నిలిపాడు.