న్యూజిలాండ్ పై సంచలన విజయం సాధించడంతో టీమిండియా నెంబర్ వన్ గా నిలిచింది. న్యూజిలాండ్ పై మూడు వన్డేల సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసింది దాంతో ఈ అరుదైన ఘనత సాధించింది. రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియా గతకొంత కాలంగా రఫ్ఫాడిస్తోంది. వరుస విజయాలు సాధిస్తూ వన్డే ర్యాంకింగ్ లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. టాప్ ప్లేస్ లో ఉన్న ఇంగ్లాండ్ ని వెనక్కి నెట్టి నెంబర్ వన్ గా నిలిచింది భారత్.
ఇక మూడో వన్డే లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ తో చెలరేగడం శుభ సూచకంగా మారింది. గత మూడేళ్ళుగా సెంచరీ చేయలేక సతమతం అవుతున్న రోహిత్ ఎట్టకేలకు చితకబాదాడు. ఇక శుబ్ మన్ గిల్ కూడా చెలరేగి ఆడటంతో భారత్ మూడో వన్డేలో సంచలన విజయం సాధించింది.