టీమిండియా మాజీ బ్యాట్స్ మెన్ అంబటిరాయుడికి అన్యాయం జరిగిందా.. ఆయనను పొమ్మనలేక పొగబెట్టరా.. అంటే, కుంబ్లే వ్యాఖ్యలు చూస్తే నిజమే అనిపిస్తున్నది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కప్పు గెల్చుకోవడంలో అంబటి రాయుడి పాత్ర కూడా కీలకమేనని కెప్టెన్ ధోని మెచ్చుకున్నాడు. ఆయన ఎన్నో కీలక ఇన్సింగ్స్ ఆడాడని, మంచి సత్తా ఉన్న బ్యాట్స్ మెన్ అని కొనియాడాడు.
అయితే తాజాగా టీమిండియా మాజీ బౌలర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 వరల్డ్ కప్ టీమ్ కు అంబటి రాయుడిని సెలక్ట్ చేయకుండా సెలక్టర్లు తప్పు చేశారని పేర్కొన్నారు. అంబటి రాయుడిన ఫోర్త్ డౌన్ ప్లేయర్ ని చేసి, మరో బ్యాట్స్ మెన్ ను జట్టులోకి తీసుకోవడంపై ఆయన మాట్లాడారు. అయితే గతంలో కూడా సెలక్టర్ల తీరును అంబటి రాయుడు తప్పుబట్టారు. తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఆ తర్వాత అంతర్జాతీయ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ తర్వాత యూటర్న్ తీసుకొని మళ్లీ ఆడాడు. ఐపీఎల్ 16 సీజన్ లో మరో సారి సత్తా చాటాడు. అయితే ఫైనల్ మ్యాచ్ తర్వాత అంబటి ఇక అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే టీమిండియా అప్పటి సెలక్టర్ రవిశాస్ర్తి, కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. వారి ప్రమేయం లేకుండా ఇది జరగదని ఆయన వ్యాఖ్యనించారు. అయితే మరి దీనిపై అప్పటి సెలక్టర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
రాజకీయాల వైపు రాయుడి అడుగులు..
అయితే రానున్న ఏపీ ఎన్నికల్లో అంబటిరాయుడు వైసీపీ నుంచి పోటీ చేయాలనుకున్నట్లు సమాచారం. ఆయన ఇప్పటికే ఏపీ సీఎం జగన్ ను కలిశారు. ఈ మేరకు ఆయన నుంచి హామీ కూడా పొందినట్లు తెలుస్తున్నది. అందుకే ఇక అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలిగినట్లు అనుకుంటున్నారు. అయితే అంబటి మాత్రం తాను జగన్ ను కలిసింది మాత్రం ఏపీలో క్రికెట్ అకాడమీ విషయమై మాత్రమేనని చెప్పుకొచ్చారు. కానీ ఆయన రాజకీయ రంగ ప్రవేశ ముహూర్తం దాదాపు ఖరారైనట్లేనని విశ్వసనీయ సమాచారం.