Ambati Rayudu : ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అంబటి రాకతో వైసీపీ బలోపేతం అయినట్లు భావించారు. అతడికి ఉన్న ఫాలోయింగ్ తో పార్టీ బలం మరింత పెరుగుతుందని ఆశించారు. కానీ అతడు పార్టీ నుంచి తప్పుకున్నాడనే వార్తలో వైరల్ గా మారాయి. వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వైసీపీలో చేరిన కొద్ది రోజులకే పార్టీ నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం పార్టీ భవితవ్యం అంధకారంలో పడిందని అంటున్నారు.
రాయుడు పార్టీ నుంచి దూరం అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై చర్చలు కూడా జరుగుతున్నాయి. దీనికి రాయుడు పెదవి విప్పారు. వైసీపీలో కొనసాగడం లేదని కుండబద్ధలు కొట్టారు. దీంతో వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. పార్టీ కోసం పనిచేస్తాడని అనుకుంటే అలా జరగకపోవడం వారిలో కలవరం పెంచుతోంది.
మరోవైపు ఈనెల 20 నుంచి దుబాయిలో జరిగే ఐఎల్ టీ 20 ముంబై ఇండియన్స్ కు ఆడనున్నందున ఇలాంటి పుకార్లు వస్తున్నాయి. కానీ తాను ముంబై ఇండియన్స్ కు ఆడటానికి రాజకీయాలతో సంబంధం లేదని చెప్పారు. క్రీడలకు రాజకీయాలతో సంబంధం ఉండదు. తనకు అవకాశం రావడానికి తాను వైసీపీలో కొనసాగుతున్నాననే వాదనలు వస్తున్నందున తన మనసులోని మాట వెల్లడించాడు. అందుకే పార్టీ నుంచి దూరం జరిగినట్లు తెలుస్తోంది.
అంబటి రాయుడు వైసీపీలో కొనసాగడం లేదనే వార్తలు పెరగడంతో ఇప్పుడు ఎక్కువ కావడంతో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదని పలువురు వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. మొత్తానికి అంబటి రాయుడి వ్యవహారం ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీనుంచి ఎందుకు బయటకు వచ్చారని పలువురు తమ చర్చల్లో ప్రస్తావిస్తున్నట్లు సమాచారం.