పగిలిపోద్ది అంటూ తన అభిమానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది స్టార్ హీరోయిన్ నయనతార. ఈ సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. నయనతార తన భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ తో కలిసి పలు దేవాలయాలను చుట్టేస్తోంది. అందులో భాగంగానే కుంభకోణం సమీపంలోని మేళవత్తూర్ గ్రామంలోని కామాక్షి అమ్మవారిని భర్తతో కలిసి దర్శించుకుంది నయనతార.
ఇంకేముంది నయనతార వచ్చిన విషయం జనాలకు తెలియడంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందులో ఒకరు సెల్ఫీ తీయడానికి ప్రయత్నించాడు అంతే ……. నయనతారకు ఎక్కడా లేని కోపం వచ్చింది. సెల్ఫీ తీశావంటే పగిలిపోద్ది అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించింది. ఈ తతంగమంతా సెల్ ఫోన్ లో రికార్డ్ అయ్యింది.
ఇది చాలదన్నట్లుగా ఓ మహిళ నయనతార వెనకాల నుండి వచ్చి మీద చేయి వేసింది ఇంకేముంది మరింత కోపం వచ్చింది నయనతారకు. దాంతో అందరినీ చీదరించుకుంటూ కారులోకి ఎక్కింది. దాంతో ఆ గ్రామస్తులు అబ్బో ! ఇంత పొగరు ఏంటో అని నయనతారపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Romba cheap eecha character iva 💦
#WorstBehaviourNayanthara#Nayanthara pic.twitter.com/OFYhxRVPqc— Saala Nee Yaruda (@kamaleshjisettu) April 6, 2023