స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన సార్ చిత్రం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 51 కోట్లను వసూల్ చేసి సంచలనం సృష్టించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సార్ చిత్రం తమిళ్ లో వాతి గా విడుదలైన విషయం తెలిసిందే. తెలుగు , తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 17 న విడుదల అయ్యింది.
ధనుష్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండటంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. మొత్తానికి 3 రోజుల్లోనే 51 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి భారీ విజయం దిశగా దూసుకుపోతోంది ధనుష్ సార్ చిత్రం. తమిళనాట ఎక్కువ వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో ఈ వసూళ్లు వస్తున్నాయి.
ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటించగా కీలక పాత్రల్లో సాయి కుమార్ , సముద్రఖని , హైపర్ ఆది తదితరులు నటించారు. విద్యావ్యవస్థలో నెలకొన్న దుర్భర పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటంతో వసూళ్లు కట్టబెడుతున్నారు. ఇక ధనుష్ కు ఈ సినిమాతో తెలుగులో మరింతగా స్ట్రాంగ్ మార్కెట్ ఏర్పడటం విశేషం.
అధునాతనమైన భవంతి …….
ధనుష్ తాజాగా అధునాతనమైన భవంతిని చెన్నై లో కట్టించాడు. ఆ ఇంట్లోకి తన తల్లిదండ్రులతో అలాగే ఇద్దరు కొడుకులతో గృహప్రవేశం చేసాడు. కొత్త ఇల్లు బాగుండటంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యతో ధనుష్ విడిపోయాడు దాంతో ఆమె ఈ వేడుకకు రాలేదు. ధనుష్ తల్లిదండ్రులు ఈ ఇద్దరినీ కలపడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసారు కానీ కుదరలేదు.