టాలీవుడ్ లో కమ్మ – కాపు అవార్డులు అంటూ పంచుకుంటారని , అందుకే నాకు అవార్డ్ ప్రకటిస్తే ఆ అవార్డ్ ను తిరస్కరించానని , ఎందుకంటే నంది అవార్డుల కమిటీలో 12 మంది సభ్యులుంటే అందులో 11 మంది కమ్మవాళ్లు ఉన్నారు అందుకే నాకు వచ్చిన అవార్డును తిరస్కరించానని సంచలన వ్యాఖ్యలు చేసాడు పోసాని కృష్ణ మురళి. అయితే ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనం సృష్టించాయి.
పోసాని వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు సీనియర్ నటులు మురళీమోహన్. చిత్రపరిశ్రమలో కులాలు లేవని , మాదంతా సినిమా కులం అంటూ పోసాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. ఇదివరకు చిత్ర పరిశ్రమలో కులాల ప్రస్తావన ఉండేది కాదు ఇప్పుడు మాత్రమే కులాల ప్రస్తావన తెస్తున్నారని , మా హయాంలో ప్రతిభ కలిగిన వాళ్లకు మాత్రమే అవార్డులు ఇచ్చామని అంతేకాని కమ్మ కులం , కాపు కులం అంటూ ఇవ్వలేదని ఘాటుగా స్పందించాడు.
అంతేకాదు అసలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులను ఏడెనిమిది సంవత్సరాలు గా ఇవ్వడం లేదు. ముందు ఆ అవార్డులు ఇవ్వాలని రెండు ప్రభుత్వాలను కోరాలని అందుకోసం ప్రయత్నించడం మానేసి ఇలా కులాల ప్రస్తావన తెచ్చి గందరగోళం సృష్టించడం ఏంటి ? అంటూ దుయ్యబట్టాడు మురళీమోహన్.