రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా అగ్ర నిర్మాత దిల్ రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నాడు. నిన్న సాయంత్రం ఆమేరకు అధికారికంగా ప్రకటన చేసారు. ఇక ఈ చిత్రానికి దర్శకుడు ఎవరో తెలుసా ……… పరశురామ్. అవును పరశురామ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించనుండగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.
ఇంతకుముందు విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబినేషన్ లో ” గీత గోవిందం ” అనే బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. ఆ సినిమాకు ముందు విజయ్ దేవరకొండకు పెద్దగా స్టార్ డం లేదు. సరిగ్గా ఆ సమయంలోనే అర్జున్ రెడ్డి విడుదల అవ్వడం కొన్నాళ్లకే గీత గోవిందం కూడా విడుదల అయి బ్లాక్ బస్టర్ కొట్టింది దాంతో ఊహించని స్టార్ డం వచ్చింది ఈ హీరోకు.
గీత గోవిందం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో సర్కారు వారి పాట చిత్రం చేసాడు పరశురామ్. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అయితే అనుకున్న స్థాయిలో రికార్డుల మోత మోగించలేదు. అలా జరిగితే స్టార్ హీరోలు పరశురామ్ కు అవకాశం ఇచ్చేవాళ్ళు. పరశురామ్ లెక్కలు కూడా వేరే లెవల్లో ఉండే ……. కానీ అవి వర్కౌట్ కాలేదు. కట్ చేస్తే విజయ్ దేవరకొండ – పరశురామ్ ల కాంబినేషన్ లో సినిమా చేయడానికి దిల్ రాజు ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.