తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా ఉంది వైసీపీ కార్యకర్తల, నేతల తీరు.. రజనీకాంత్ ను ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్న మానసిక వికృత ఆనందం పొందుతున్నారు. రజనీకాంత్ పై తమ నేతలు వినిపించిన తిట్ల పురాణాన్ని ఆ పార్టీ అడ్డగోలుగా సమర్థించుకుంది. చంద్రబాబును పొగిడితే తిడతామని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇది ఒక్కటి చాలు వైసీపీ శ్రేణులకు ఇంత పిచ్చి ముదిరింది అనడానికి.
టీడీపీ అధినేత చంద్రబాబును పొగిడితే ఖచ్చితంగా విమర్శిస్తామని ఖరాఖండిగా చెప్తుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఈ అంశంపై స్పందించింది. 5 కోట్ల మంది ప్రజలు తీర్పునిస్తే 23 సీట్లకు పరిమితమైన పార్టీ టీడీపీ అని.. మూడు సార్లు దారుణంగా ఓడిపోయారని వైసీపీ విమర్శించారు. ఏపీని నాశనం చేసిన వ్యకిని పొగితేతే సహించాలా అనికూడా ప్రశ్నిస్తున్నారు. ఇరు పార్టీలు డెవలప్ మెంట్ పై కాకుండా ఒకరిపై ఒకరు తిట్ల దండకం చేసుకుంటున్నారు.
అంతేకాకుండా చంద్రబాబుపై కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. సొంత ఊరిలో ఓడిపోయి కుప్పానికి పరిగెత్తిన ఫెయిల్యూర్ పాలిటీషియన్.. ఏపీని నాశనం చేసిన ఓ దుర్మార్గుడిని పొగిడితే ప్రశ్నించడం ఏ మాత్రం తప్పు కాదని స్పష్టం చేసింది. రాష్ట్రాన్ని ఎవరు నాశనం చేశారో స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఎవరు పేద ప్రజల్ని దోచుకుంటున్నారో.. మద్యం అలవాటు ఉన్న కుటుంబాల ఆస్తిపాస్తులు కూడా అమ్ముకునేలా చేసి ఎలా రోడ్డున పడేశారో కనిపిస్తూనే ఉంది. ఏపీలో ఉద్యోగాలే కాదు.. చదువుకునే పరిస్థితులు లేక పొరుగు రాష్ట్రాలకు పరుగులు పెడుతున్న వారు కళ్లెదటే ఉన్నారు. అయినా సరే.. ఎదురుదాడి చేస్తూ..చంద్రబాబును పొగిడారు కాబట్టి అమ్మనా బూతులు తిట్టడం కరెక్టేనని.. తమ రాజ్యాంగంలో ఉందని వాదిస్తున్నారు. వైసీపీ సైకో మనస్థత్వానికి ఈ సమర్థింపు మరో సాక్ష్యంగా కనిపిస్తోంది. ఎంత మంది ఛీ కొడుతున్నా వైసీపీ నేతల్లో మాత్రం మార్పు రావడ లేదు. మాకు నోటి విరేచనాలు వచ్చు.. ఎవరి మీద కోపం వస్తే వారి మీద చేసుకుంటామన్నట్లుగా ఉన్నారు.