36.9 C
India
Sunday, May 5, 2024
More

    CM own district : అమరావతిని కాదన్న సీఎం జగన్.. సొంత జిల్లాకే ఆ చాన్స్!

    Date:

    CM own district
    CM own district, ap cm Jagan

    CM own district : ఏపీ సీఎం జగన్ ముందు నుంచి అమరావతికి వ్యతిరేకంగానే ఉన్నారు. టీడీపీ హయాంలో తీసుకున్న ఈ రాజధాని నిర్ణయాన్ని పక్కన పెట్టేసి, మూడు రాజధానులు అంటూ ఆయన ముందుకెళ్లారు. న్యాయస్థానాల్లో ఇబ్బందులు ఎదురైనా, నాడు రాజధానికి భూములిచ్చిన రైతులు వ్యతిరేకించినా ఇప్పటివరకు రాజధానిపై తేల్చకుండా ముందుకు సాగుతున్నారు. అమరావతి శాసన రాజధాని, విశాఖకు పరిపాలన రాజధాని అంటూ ఆయన ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురిచేస్తున్నది. కొత్త నగర నిర్మాణంపై ఆయన తీసుకున్న నిర్ణయం విమర్శలకు కారణమవుతున్నది.

    15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు దేశంలో కొత్తగా ఎనిమిది నగరాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం అమరావతిలో అన్ని వనరులు, అవకాశాలు ఉన్నా, మరో కొత్త పేర్లు ప్రకటిస్తూ ప్రతిపాదనలు పంపింది. సీఎం సొంత జిల్లా అయిన కడపలోని కొప్పర్తి పేరును తెరపైకి తెచ్చింది. శాసన రాజధానిగా అమరావతికి తొలి ప్రాధాన్యమివ్వాల్సిన సర్కారు కొప్పర్తి పేరు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

    కేంద్రం నిర్మించాలనుకున్న ఈ కొత్త నగరానికి రూ. 1000 కోట్ల మేర కేంద్రం నిధులు కేటాయిస్తుంద. ఏటా 250 కోట్లు ఇస్తుంది. అయితే అమరావతి అభివృద్ధి చేయాలనుకుంటే కేంద్రం ఇచ్చే నిధులను వాడుకోవచ్చు నాలుగేళ్లుగా అమరావతిని పక్కన పెట్టిన రాష్ట్రం ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ప్రస్తుతం ఆర్థిక సంఘం ప్రతిపాదనలతో వారు అమరావతిని అత్యద్భుతంగా తీర్చిదిద్దవచ్చు. అమరావతిని అభివృద్ధి చేస్తే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు దీటుగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకు వనరులు పుష్కలంగా ఉన్నాయని ప్రణాళికే ముఖ్యమని చెబుతూ వచ్చారు.

    కానీ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా అమరావతిపై కక్షపూరితంగా ముందుకెళుతున్నదని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి అయినా ఈ నగరం నిర్మాణానికి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    అమరావతిలో కొత్త నగర నిర్మాణానికి సేకరణ సమస్య లేదు ఇప్పటికే అమరావతిలో భూసేకరణ పూర్తయింది మిగులు భూమి కూడా ఉంది. జల వనరులు, రవాణా సదుపాయాలు, నిధులు, రుణ అవకాశాలు పుష్కలంగా ఉన్నా, రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేయడం విమర్శలకు తావిస్తున్నది. ఏదేమైనా ఒక రాష్ర్ట భవిష్యత్  ను అంధకారం చేసేలా ఉన్న రెండు పార్టీల మధ్య వార్ ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...

    AP Liquor : ఓటేసే ముందు వైన్స్ షాపులను చూసి వెళ్లండి..

    AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల ముందు జగన్...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Viral Video : ‘‘రెండో సారి సీఎం కావాలంటే మూడో శవం కావాలే..’’ ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..

    Viral Video : ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతల ప్రసంగాలు ఘాటెక్కుతున్నాయి....