Phone Tapping : సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడుగా వ్యవ హరిస్తు న్నారు. ట్యాపింగ్ హార్ట్ డిస్కులను మూసీ నదిలో పడేసినట్లు నిందితుడు ప్రణీతరావు విచారణలో వెల్లడించారు.
దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగో మూసి వంతెన కింద వాటిని స్వాధీనం చేసుకొని FSL కు పంపించారు. ఈ కేసులో పోలీ సులు ఏ-1 గా ప్రణీత్రావు, ఏ -2 గా భుజంగ రావు, ఏ -3 గా తిరుపతన్నను చేర్చారు. ఇప్పటికే వారు నేరాన్ని అంగీకరించారు.
మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నేరం చేసి నట్టు పోలీస్ అధికారులు ఒప్పుకోవడంతో విచారణ మరింత వేగవంతం అవుతుంది. హార్డ్ డిస్కులు స్వాధీనమయ్యాయి కాబట్టి మరి కొద్ది రోజుల్లోనే అందులో ఉన్న డేటా కూడా బయటికి వస్తుంది.