గత ఐదు సంవత్సరాల కాలం లో విదేశాల్లో 403 మంది భారతీయులు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కెనడాలో అత్యధిక మరణాలు సంభవించాయి. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు,అనారోగ్యం ఇలా పలు కారణాలతో విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన అనేకమంది భారతీయ విద్యార్థులు అక్కడ ప్రాణాలు కోల్పోయి తమ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. 2018 నుంచి ఇప్పటివరకు 400 మందికి పైన విద్యార్థులు విదేశాల్లో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది ఇందులో అత్యధిక మరణాలు కెనడా లోని చోటు చేసుకున్నట్లు తెలిపింది ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం గత ఐదేళ్లలో మొత్తంగా 34 దేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు మరణించారు. అత్యధికంగా కెనడాలో 91 మంది మృతి చెందారు ఆ తర్వాత యూకే లో 48మంది రష్యాలో 40 మంది అమెరి కాలో 36 మంది ఆస్ట్రేలియాలో 35 ఉక్రెయిన్ లో 21 జర్మనీలో 20 సైప్రస్ లో 14 ఇటలీ పిలప్పి యన్స్ లో పదిమంది చొప్పున విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
Breaking News