Indian Students : భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లడం కొత్తేమీ కాదు, చాలా కాలంగా ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో కొందరు విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లారు. కానీ ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని వెనక్కి పంపించడంతో వారి అమెరికన్ కలలు కల్లలయ్యాయి. 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా నుంచి వెనక్కి పంపారు. వారి పత్రాలను తనిఖీ చేసి, వారి ఇమెయిల్ సంభాషణలు , వాట్సాప్ చాట్లను పరిశీలించిన తర్వాత అధికారులు వారిని వెనక్కి పంపినట్లు చెబుతున్నారు. శాన్ఫ్రాన్సిస్కో, అట్లాంటా, చికాగో విమానాశ్రయాల్లో దిగిన విద్యార్థులను తిరిగి భారత్కు రప్పించారు.
అమెరికా నుంచి బహిష్కరణకు గురైన విద్యార్థులు తమ ఆవేదనన ఏకరువు పెట్టారు. తమ కాలేజీ అడ్మిషన్లు, బ్యాంక్ బ్యాలెన్స్ నిర్ధారించే పేపర్లు , విశ్వవిద్యాలయాలు , కాలేజీలకు ఫీజుగా చెల్లించిన డబ్బు వంటి అవసరమైన అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయని.. అయినా పంపించారని ఆరోపించారు. ఇన్ని పత్రాలు ఉన్నప్పటికీ మమ్మల్ని వెనక్కి పంపించారన్నారు..
మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే వారిని ఎందుకు బహిష్కరించారనే సందేహం చాలా మందికి కలుగుతోంది.. భారతీయ విద్యార్థులను అమెరికా నుంచి ఎందుకు బహిష్కరించారు? విద్యార్థులు పాటించాల్సిన సూచనలపై నిపుణులు క్లారిటీ ఇచ్చారు.
ఇమ్మిగ్రేషన్ అధికారులు మన భారతీయ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. వాట్సాప్ చాట్లు, వారి ఖాతాలలోని బ్యాంక్ బ్యాలెన్స్ చూపించమని వారిని అడిగారు. వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలను కూడా తనిఖీ చేసినట్లు సమాచారం.. ఎంబసీ పత్రాల్లో పేర్కొన్న సరైన సమాధానాలు చెప్పని వారిని పక్కన పెట్టారు.
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం అంత తేలికైన విషయం కాదు. విద్యార్థులు కొన్ని పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి. వారి ఖాతాలలో కొంత బ్యాలెన్స్ ఉండాలి. కొంత మంది విద్యార్థులు బ్యాలెన్స్ ఉందని ధనవంతులుగా చూపిస్తుంటారు. మరికొందరు విద్యార్థులు అధికారులకు చూపించడానికి మాత్రమే డబ్బులను అప్పుగా తీసుకొని తమ ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు. ఒక నిర్దిష్ట వ్యవధి తర్వాత వారు మొత్తాన్ని ఉపసంహరించుకుంటారు. వారు మొత్తాన్ని ఎక్కడ నుండి తీసుకున్నారో వారికి తిరిగి చెల్లిస్తారు. అమెరికాలో ఎంట్రీ కోసమే ఇలా చేస్తారు. ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా చాలా చూశారు అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు.. దీనికి పాల్పడిన విద్యార్థులను వెనక్కి పంపించేశారు.
మరోవైపు విదేశీ విద్యార్థులు పార్ట్టైమ్ ఉద్యోగాలు పొందేందుకు అమెరికాకు చదువుల పేరిట వస్తున్నారని అమెరికన్ అధికారులు గుర్తిస్తున్నారు. చదువు పేరిట యూనివర్సిటీల్లో చేరి వివిధ ఉద్యోగాల్లో చేరుతున్నారు. భారతీయ కన్సల్టెన్సీలు వీరి చేత రెండూ మూడు జాబులు చేయిస్తూ సగం వాళ్లు,. సగం వీళ్లకు ఇస్తూ దోచుకుంటున్నట్టు అధికారుల విచారణలో తేలింది. తద్వారా అమెరికన్లకు జాబులు కరవవుతున్నాయి. ఒక్కో భారతీయ విద్యార్థి చదువు పేరిట అమెరికా వచ్చి ఇతర సాఫ్ట్ వేర్ , ఇతర జాబులు చేయిస్తూ వర్క్ ఫ్రం హోం పేరిట మూడు నాలుగు జాబులు చేస్తున్నట్టు విచారణలో తేలింది. అందుకే అలాంటి వారిని ముందే గుర్తించి తిరస్కరిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇండియా నుంచి వచ్చే ఇలాంటి విద్యార్థుల విషయంలో అమెరికన్ అధికారులు నిబంధనలు కఠినతరం చేశారని చెబుతున్నారు. ఇంతకుముందు, అలాంటి నియమాలు లేవు, కానీ స్థానికులకు ఉపాధి లేకుండా చేసేందుకు విదేశీ విద్యార్థులను తీసుకొచ్చి పనులు చేయిస్తున్నట్టు తేలడంతోనే వీరికి అడ్డుకట్ట వేస్తున్నారు.
నకిలీ కళాశాలలు , విశ్వవిద్యాలయాలు మరొక కారణం కావచ్చు. విద్యా సంస్థలు కొన్ని నియమాలు , నిబంధనలను అనుసరించాలి . వాటికి కట్టుబడి ఉండాలి. కానీ పేరు, ఊరు, నిబంధనలు పాటించని కాలేజీల్లో చేరి హాజరు శాతం వేయించుకుంటూ విద్యార్థులు ఇతర జాబులు చేస్తూ క్యాష్ చేసుకుంటున్నట్టు అధికారుల విచారణలో తేలింది.
మరోవైపు, యుఎస్లో కొన్ని నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 2019లో నకిలీ విశ్వవిద్యాలయాలు ఛేదించబడ్డాయి. విద్యార్థులు ఈ నకిలీ విశ్వవిద్యాలయాలలో చేరి ఉండవచ్చు. పత్రాలను పరిశీలించిన తర్వాత, అధికారులు వారిని బహిష్కరించి ఉండవచ్చు. మొత్తంగా ఫేక్ చదువులు చదివేందుకు వచ్చి అమెరికాలో ఉద్యోగ, ఉపాధి కొల్లగొట్టే విద్యార్థులను.. టాలెంట్ లేని వారిని.. సరిగ్గా సమాధానాలు చెప్పకుండా పొంతనలేని ఆన్సర్లు ఇచ్చిన వారిని.. వారి సోషల్ మీడియా ఖాతాల్లో తప్పుడు సంకేతాలు ఇచ్చిన వారందరినీ అమెరికా నుంచి అధికారులు బహిష్కరించిన పరిస్థితి నెలకొంది.