Andhra Pradesh : 2023 అక్టోబర్ 1 తరువాత పుట్టిన వారికి కేంద్రం బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి చసింది. ఈ నేపథ్యంలో ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఇకపై పుట్టిన తేదీ, ప్రదేశం నిరూపించే ఏకైక పత్రం ఇదే అని అధికారులకు తెలియజేశారు. స్కూళ్లలో ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలు, పాస్పోర్ట్, ఆధా ర్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు, వివాహ నమోదు సహా పలు ప్రయోజనాలకు ఇది తప్పనిసరి అన్నా రు. పుట్టిన 7 రోజుల్లోనే ఈ సర్టిఫికెట్ ఇవ్వా లినీ అని అధికారులను ఆదేశించారు.