అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయమే ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సీఎం జగన్ మూడు రోజులు పా టు ఢిల్లీలోనే ఉండ నున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన మం త్రి నరేంద్ర మోడీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, విభజన హామీ లు, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం సహా పలు అంశాలపై చర్చించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారింది.