ఏపి సీఎం జగన్ హైదరాబాద్ నందినగర్ లోని మాజీ సీఎం కేసిఆర్ ఇంటికి చేరుకున్నారు. ఆయనకు బీఆర్ ఎస్ నేతలు కేటిఆర్ , తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. అనంతరం తుంటి ఎముక సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్న బీఆర్ఎస్ చీఫ్ కేసిఆర్ గారిని ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే లంచ్ మీటింగ్ ఉంటుందని సమాచారం.