చైనాలో భూకంపం సంభవించడంతో సుమారుగా 116 మందికి పైగా మృతి చెందారు. 400 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.2గా నమోదు కావడం వల్ల దీని తీవ్ర తతో పలు భవనాలు నేలమట్టం అవుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలోని వాయువ్య గన్సు, కింగ్హై ప్రావిన్స్ల్లో భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించినట్లు అంతర్జా తీయ మీడియా వెల్లడించింది. భుకంపం నేపధ్యం లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన అదేశించారు.
అర్ధరాత్రివేళ భూకంపం రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు 6,381 ఇల్లు నేలమట్టమయ్యాయి. భూ అంతర్భాగంలో 35 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభవిం చాయని, గన్సు ప్రావిన్సులోని లాన్జ్హౌకు (Lanzhou) 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నద ని చైనీస్ మీడియా తెలిపింది. దీంతో భారీ నష్టం సంభవించింది. మంగళవారం తెల్లవారుజున అధికారు లు సహాయక చర్యలు చేపట్టారు.