Fishing Break : ఏపి ప్రభుత్వం సముద్రంలో చేపల వేటపై సోమవారం నుంచి నిషేధం విధించింది. జూన్ 14 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులకు రెండు నెలల పాటు విరామం ఉంటుంది. మత్స్య సంపద పెరిగే కాలం కావడంతో 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై ప్రతి ఏటా ప్రభుత్వం అమలు చేస్తోంది. కాగా ఈ విరామం సమయంలో మత్స్యకారుల కుటుంబానికి రూ. 10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది.
Breaking News