Cyber Scam : కొత్త తరహా నేరాలతో సైబర్ కేటుగాళ్లు విజృంభి స్తున్నారు. ఇష్టానుసారంగా ఫోన్ నెంబర్లు సేకరించి కొత్త కొత్త స్కాముల పేరుతో బాధితులను బెదిరిం చి డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా హైదరా బాద్ కు చెందిన ఐఐటి పీహెచ్ డీ స్కాలర్ విద్యార్థి ఖాతా నుండి 30 లక్షల రూపాయలను సైబర్ కేటుగాళ్లు మాయం చేశారు.
హైదరాబాద్ కు చెందిన ఐఐటి పీహెచ్డీ స్కాలర్ విద్యార్థికి ఓ అగంతకుడు నుండి ఫోన్ కాల్ వ చ్చింది తమ కొరియర్ సర్వీస్ నుండి మాట్లాడు తున్నామని విద్యార్థికి తెలిపారు. ఆ పార్సెల్ లో కొన్ని అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని మభ్యపెట్టారు. ఇలాంటి వస్తువులు ఉన్నాయో తెలపాలని విద్యార్థి కొరియర్ వారిని ఎదురు ప్రశ్నే వేశాడు.
అనుమానాస్పదంగా ఉన్న పార్సెల్ లో డ్రగ్స్ తో పాటు ఒక పాస్పోర్ట్ ఉన్నట్లు బాధితులని సైబర్ కేటుగాళ్లు నమ్మించారు. కొరియర్ సంస్థ వారు వెంటనే ముంబై పోలీసులకు కాల్ కలుపుతున్నట్లు నటించారు. ఆ వెంటనే లైన్ లోకి వచ్చిన మరో సైబర్ నేరగాడు అతడిని మరింత బెదిరించే ప్రయ త్నం చేశాడు. తన బ్యాంక్ అకౌంట్కు టెర్రరిస్టులతో లింకు ఉన్నట్లు నమ్మించారు.
అందుకే తన మీద కేసులు నమోదు చేస్తున్నా రంటూ ఒక నకిలీ ఎఫ్ఐఆర్ సైతం తయారుచేసి బాధితుడికి వాట్సాప్ లో పంపించారు. ఇదంతా నిజమే అని అనుకొని తీవ్రవాత్రికి గురై 30 లక్షల రూపాయలు చెల్లించాలని సైబర్ క్రైమ్ పోలీసు లను ఆశ్రయించారు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఫోన్ నెంబర్లు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.