Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోసం అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ పాకులాడుతున్నాయి. గతంలో అధికారం చేపట్టాలని వైసీపీ నేత జగన్ పాదయాత్ర చేపట్టి గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీడీపీ కూడా పాదయాత్ర ద్వారానే మరోసారి విజయం సాధించాలని చూస్తోంది. ఇందులో భాగంగా యువగళం ద్వారా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర చేపట్టి రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు.
ఇందులో భాగంగా తాటికొండ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సాగుతోంది. వైసీపీ విధానాలు ఎండగడుతూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం టీడీపీకి కట్టబెట్టాలని కోరుతున్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ రౌడీయిజం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు వీధి గుండాల్లా చెలరేగిపోతున్నారని మండిపడుతున్నారు.
రాష్ట్రం మొత్తం చుట్టి వస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రాధేయపడుతున్నారు. యువత టీడీపీకి పట్టం కట్టాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలని ఆశిస్తున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో ఏపీలో రాజకీయ మార్పు కావాలని అభిలషిస్తున్నారు.
టీడీపీని మరోమారు అధికారంలోకి తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నేతల ఆగడాలను ఎక్కడకక్కడ నిలదీస్తున్నారు. వారి విధానాలను తప్పుబడుతున్నారు. పరిపాలనలో వారి వైఖరిని ఖండిస్తున్నారు. వైసీపీ పాలనకు చరమ గీతం పాడాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో టీడీపీకి విజయం తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.