Hyderabad : రాష్ట్రంలో ఆదివారం నుంచి గురువారం వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా రెండు నుంచి ఐదు డిగ్రీల వరకు పెరుగుతాయని తెలిపింది. శనివారం రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది.