Ambati Tea Cups : ఐడియా అంటే కాస్టిలీగా ఉండాలి కానీ చీప్ గా ఉండకూడదు. అది మనం ఆలోచించే తీరును బట్టి ఉంటుంది. మన ఆలోచనలు రిచ్ గా ఉంటే దాని ఫలితాలు కూడా రిచ్ గా వస్తాయి. అంతేకాని మన ఆలోచనలు పిచ్చిపిచ్చిగా ఉంటే వాటి వల్ల వచ్చే ఫలితాలు కూడా అలాగే ఉంటాయని చాలా సందర్భాల్లో రుజువైంది. ఇప్పుడు మనం చెప్పుకునే విషయంలో కూడా అలాంటి గమ్మత్తే ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేత అంబటి రాంబాబు ఎన్నికల ప్రచారం ఎలా చేయాలనే దానిపై ఓ ఆలోచన చేశారు. టీ కప్పుల మీద వైసీపీ బొమ్మలు వేయించాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో టీకప్పులు వచ్చాయి. వాటిని వాడాలని హోటళ్లకు హుకుం జారీ చేశారు. వారి ఆదేశాను సారం టీకప్పులు వాడుతున్నారు.
వాడిన కప్పులను చెత్త బుట్టలో వేశారు. దీంతో బుట్టలన్ని చూస్తే చేరాల్సిన చోటకే చేరాయని జనాలు సెటైర్లు వేస్తున్నారు. టీకప్పులు కొనాలంటే డబ్బు ఖర్చవుతుంది. డబ్బులు మిగులుతాయని అనుకుని వాటిని తీసుకుని టీ కొట్టు యజమానులు వాడుతున్నారు. కానీ అవి చెత్తబుట్టలో కనిపించడంతో అందరు నవ్వుకుంటున్నారు. వైసీపీకి మంచి స్థానమే దక్కిందని అంటున్నారు.
అంబటి రాంబాబు ఆలోచన ఇంత దరిద్రంగా ఉంటుందా అని చర్చించుకుంటున్నారు. చెత్తబుట్టల్లో ఎక్కడ చూసినా టీ కప్పులే కనబడుతున్నాయి. కప్పులు పంచడం నిబంధనలు ఉల్లంఘించడమే అని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో వ్రతం చెడినా ఫలితం దక్కితే బాగుండు అనే ధోరణిలో వైసీపీ ఆలోచనలో పడిపోయింది.
ఆ కప్పులపై కుక్కలు చేయకూడని పనులు చేస్తున్నాయి. అది చూసిన వైసీపీ నేతలు తెగ బాధపడుతున్నారు. తమ పార్టీ దుర్గతికి విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏదో చేద్దామని అనుకుంటే ఏదో జరిగిందన్నట్లు రాంబాబు ఆలోచన ఇంత చండాలంగా ఉంటుందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాంబాబు ఆలోచన పార్టీని ఇరకాటంలో పడేసిందంటున్నారు.