AP High Court verdict : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ హైకోర్టు గత మంగళవారం మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే ఈ బెయిల్ పై మరికొన్ని షరతులు విధించాలనే సీఐడీ పిటిషన్ పై కోర్టు తీర్పును వెల్లడించింది. చంద్రబాబు రాజకీయపరమైన ర్యాలీలో పాల్గొనకూడదని చెప్పింది. స్కిల్ కేసుకు సంబంధించిన అంశాలను మీడియాతో మాట్లకూడదని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది.
అయితే చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై పలు నిబంధనలు సీఐడీ పిటిషన్ వేసింది. ఇందులో భాగంగా చంద్రబాబు కార్యకలపాలను గమనించేందుకు ఆయన వెంట ఇద్దరు సీఐడీ డీఎస్పీలను నియమించాలని వేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. సీఐడీ వేసిన పిటిషన్ పై బుధవారం వాదనలు ముగించిన హైకోర్టు.. ఇవాళ హై కోర్టు తీర్పునిచ్చింది. ఇద్దరు సీఐడీ డీఎస్పీలను చంద్రబాబు వెంట ఉంచాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
అయితే చంద్రబాబు విడుదల అనంతరం పెద్ద సంఖ్యలో జనం ఆయనకు నీరాజనం పట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వం సీఐడీతో చంద్రబాబుకు కట్టుదిట్టమైన అంక్షలు పెట్టించాలని భావిస్తున్నది. ఆయన ప్రజల ముందుకు వెళ్లకుండా చేయాలని భావిస్తున్న క్రమంలో , ఏపీ హైకోర్టు సీఐడీ అభ్యర్థనని తోసిపుచ్చింది. దీనిపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబుకు వస్తున్న ఆదరణ చూడలేక ఇప్పటికే 8 కేసులకు పైగా అభియోగాలు పెడుతూ ఇబ్బందులు పెడుతున్న రాష్ర్ట సర్కారు, మరింత కఠువుగాముందుకు వెళ్లేందుకే సిద్ధమవుతున్నది. అందుకే సీఐడీ తో పిటిషన్ల మీద పిటిషన్లు వేయిస్తున్నది. ఇక్కడితో ఆగేది లేదని చెప్పకనే చెబుతున్నది. మరి రానున్న రోజుల్లో మరెన్ని కేసులు చంద్రబాబు మీద పెట్టాలని అనుకుంటున్నదో తేలాల్సి ఉంది.