Chandrayaan 3 : చంద్రయాన్ 3 విజయవంతమైంది. ఎందరో ఏళ్ల కష్టం.. కోట్లాది మంది భారతీయుల ప్రార్థనలు ఫలించి విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగ్విజయంగా అడుగు పెట్టింది. భారతజాతి మొత్తం గర్వించేలా చంద్రుడి దక్షిణ ధ్రువం పై అడుగిడిన ఈ ల్యాండర్ సక్సెస్ వెనుక ఎంతో శ్రమ ఉంది. అకుంఠిత దీక్ష, ప్రణాళికతో పని చేసి అంతరిక్షరంగంలో మరో మైలురాయికి ఇండియాను చేర్చారు. ఎన్నో అగ్రదేశాలకు సాధ్యం కాని ఈ ప్రయోగాన్ని మన ఇస్రో సాధించి, ప్రపంచ దేశాల దృష్టిని మనవైపు తిరిగేలా చేసింది.
ఇస్రో ఘనతను అనుకున్న స్థాయిలో ఇండియన్ మీడియా పట్టించుకుందా..? అసలు ఈ విజయం వెనుక ఉన్నదెవరు..? క్రెడిట్ దక్కిందెవరికి..? అవును నిజమే ఇండియన్ మీడియా తో పాటు సోషల్ మీడియా వెనుక ఈ ప్రయోగం సక్సెస్ చేసింది మోదీ అన్నట్లుగానే వార్తలు, పోస్టులు కనిపించాయి. ఇదేదో ప్రభుత్వ ఘనత అన్న రీతిలో కథనాలు వల్లే వేశాయి. కానీ దీని వెనుక ఉన్న శ్రమ ఆ సైంటిస్టులది. రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని చేసిన ఈ ప్రయోగం విజయవంతం చేసిన ఏ ఒక్కరి శ్రమను వెలకట్టలేం. ముఖ్యంగా ఇస్రోలో కీలక వ్యక్తులు మాజీ చైర్మన్, ప్రస్తుత చైర్మన్ శ్రమ ఇందులో ఎంతో దాగి ఉంది. రాకెట్ సాంకేతిక నిపుణులైన ఇస్రో మాజీ చైర్మన్ కే శివన్, ఎస్ సోమనాథ్ దీని వెనుక ఎంతో కష్టపడ్డారు.
కానీ వీరిద్దరినీ ఇండియన్ మీడియా మర్చిపోయింది. కేవలం వ్యక్తి పూజలో నిమగ్నమై, క్రెడిట్ ను మరొకరికి అంటగట్టే ప్రయత్నం చేసింది. అహో.. ఓహో అంటూ కథనాలు పేర్చింది. కే శివన్, ఎస్ సోమనాథ్ ల శ్రమను గుర్తించని ఇండియన్ మీడియాపై ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పేలుతున్నాయి. నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. వీరిద్ధరి ముఖాలను గుర్తు పెట్టుకోండి అంటూ పోస్టులు బయటకు వస్తు్న్నాయి. ఇప్పడవే వైరల్ గా మారాయి. ఏదేమైనా చంద్రయాన్ 3 భారత కీర్తి పతకాను అంతరిక్ష స్థాయికి తీసుకెళ్లింది.