World Culture Festival :
కాగా, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ ఉత్సవాలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయనతో పాటు మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపన్, యూఎస్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి తదితరులు తమ విలువైన ప్రసంగాలు ఇచ్చారు. మొదటి రోజు రికార్డుస్థాయిలో పది లక్షల మంది హాజరయ్యారు. మనమంతా విశ్వకుటుంబం అంటూ రవిశంకర్ ఇచ్చిన అద్భుత ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఇక రెండో రోజు కూడా పెద్ద సంఖ్యలో వీక్షకులు పాల్గొన్నారు.
అయితే ప్రపంచ సాంస్కృతిక సంరంభం వాషింగ్టన్ లో నిర్వహించడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. భారతీయ సంస్కృతిని కూడా అన్ని దేశాలకు తెలియజేసేలా ఈ సంరంభం ఉపయోగపడిందని అంతాా అభిప్రాయపడుతున్నారు. ఈ సంరంభానికి పెద్ద సంఖ్యలో అమెరికన్ భారతీయులు , వివిధ దేశాల వాసులు కూడా ఈ సంరభంలో పాల్గొన్నారు.