Bangladesh Ship : బంగ్లాదేశ్ కు చెందిన ఒక భారీ ఓడ ఇప్పుడు విశాఖపట్నం సముద్ర తీరంలో ఉంది. ప్రస్తుతం దీన్ని సందర్శకులు చూస్తున్నారు. ఈ ఓడ ఇక్కడికి ఎలా వచ్చింది..? ఇక్కడ ఎందుకు ఉంది..? అనే దాని గురించి జైస్వరాజ్ టీవీ వివరంగా తెలిపింది.
బంగ్లాదేశ్ కు చెందిన ఈ భారీ ఓడ ఇండియా టూ బంగ్లాదేశ్ మధ్య క్రూడ్ ఆయిల్ ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్ చేస్తుంటుంది. 2020లో విశాఖ హార్బర్ కు వచ్చిన ఓడలో సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిపోయింది. ఈ ఓడను తీసుకెళ్లేందుకు ఇటు భారత్, అటు బంగ్లా దేశాలు చర్చలు జరిపాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ లో తీవ్ర తుపాన్ వచ్చింది. దీంతో సముద్రం అల్లకల్లోలమైంది.
సముద్రంలోని యాంకర్ డీలింక్ కావడంతో అలల ఒత్తిడికి ఈ ఓడ నాలుగు నాటికల్ మైళ్ల తీరానికి కొట్టుకు వచ్చింది. అలా వచ్చిన ఓడ సముద్ర తీరంలో ఉండే బండరాళ్లలో చిక్కుకుపోయింది. అక్కడి నుంచి కదిలించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో బంగ్లాదేశ్ ఓడను విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఇక అప్పటి నుంచి ఈ ఓడ సందర్శనకు ఉంచారు. ఎలాంటి రుసుము లాంటివి వసూలు చేయకుండానే సముద్ర తీరంలో పర్యాటకులు దీన్ని సందర్శిస్తున్నారు. ఈ ఓడ కాళీగా ఉండడంతో తీరానికి వచ్చిన ప్రేమికులు దీనిపై తమ పేర్లను చెక్కుతున్నారు. ఓడ కింది భాగం పూర్తిగా ప్రేమికుల పేర్లతో నిండి ఉంటుంది.